Friday, June 2, 2023

శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టిత ఏకైక ఆంజనేయ స్వామి ఆలయం....


 **శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టిత ఏకైక ఆంజనేయ స్వామి ఆలయం.....!!*

దక్షిణభారతదేశంలో పడమటి కర్నాటక రాష్ట్రంలో పడమటి కనుమల్లో మలండ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఆది శంకరరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. 


కేరే అంటే సరస్సు అని కన్నడ అర్ధం, సరస్సు ఒడ్డునే ఆలయం ఉంది. 

శ్రీ శంకర భగవత్ పాదులు భారతదేశం మొత్తం మీదక్కడ శృంగేరిలో ఒక్క చోట మాత్రమే శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. 

అందువల్ల దీనికి విపరీతమైన ప్రసిద్ధి వచ్చింది, శృంగేరిలో పశ్చిమాన కేరే ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడున్నకొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. 

కోనేరు స్థానంలో ఇప్పుడు బస్ స్టాండ్ కట్టారు, చిన్న దేవాలయం అయినా చాలా అందంగా ఉంది. 

ప్రకృతి దృశ్యాలక మధ్య ఉంది. కేరే ఆంజనేయ స్వామిని దర్శించాలి అంటే 27 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. 


శృంగేరికి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ కేరే ఆంజనేయ స్వామిని దర్శించి , ఆ తర్వాత మిగతా దైవ దర్శనం చేస్తారు.


ఆంజనేయస్వామి ఈ క్షేత్ర పాలకుడు కావటమే దీనిలోని విశేషం.

ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశాగా దర్శన మివ్వటం ఒక ప్రత్యేకత.


స్వామి ఎడమ చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉంటాడు, కుడి చేయి అందరిని దీవిస్తున్నట్లు ఉండటం విశేషం.

స్వామి వాలం శిరస్సు ఆ వ్యాపించి ఉంటుంది. 

తోక చివర చిన్న గంట కట్టి ఉంటుంది, కాలికి నూపురం ఉంటుంది. 

చేతికి కేయూరం ధరించి ఉంటాడు. 

ఆయన నేత్రాలు కృపా సింధువులై భక్త జనాల పై కరుణా కటాక్షాలు వర్షిస్తున్నట్లు విశాలంగా, తేజో పుంజాలను వేద జల్లేవిగా కనిపిస్తాయి. 


కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు.

 కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు,  ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు వరకు, సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.


శృంగేరిలో జగద్గురువులు

 శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టించిన చదువుల తల్లి శారదాదేవి ఆలయం భారతదేశమంతా ప్రసిద్ధి చెందింది. 

కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి........!!*

దక్షిణభారతదేశంలో పడమటి కర్నాటక రాష్ట్రంలో పడమటి కనుమల్లో మలండ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఆది శంకరరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. 


కేరే అంటే సరస్సు అని కన్నడ అర్ధం, సరస్సు ఒడ్డునే ఆలయం ఉంది. 

శ్రీ శంకర భగవత్ పాదులు భారతదేశం మొత్తం మీదక్కడ శృంగేరిలో ఒక్క చోట మాత్రమే శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. 

అందువల్ల దీనికి విపరీతమైన ప్రసిద్ధి వచ్చింది, శృంగేరిలో పశ్చిమాన కేరే ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడున్నకొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. 

కోనేరు స్థానంలో ఇప్పుడు బస్ స్టాండ్ కట్టారు, చిన్న దేవాలయం అయినా చాలా అందంగా ఉంది. 

ప్రకృతి దృశ్యాలక మధ్య ఉంది. కేరే ఆంజనేయ స్వామిని దర్శించాలి అంటే 27 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. 


శృంగేరికి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ కేరే ఆంజనేయ స్వామిని దర్శించి , ఆ తర్వాత మిగతా దైవ దర్శనం చేస్తారు.


ఆంజనేయస్వామి ఈ క్షేత్ర పాలకుడు కావటమే దీనిలోని విశేషం.

ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశాగా దర్శన మివ్వటం ఒక ప్రత్యేకత.


స్వామి ఎడమ చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉంటాడు, కుడి చేయి అందరిని దీవిస్తున్నట్లు ఉండటం విశేషం.

స్వామి వాలం శిరస్సు ఆ వ్యాపించి ఉంటుంది. 

తోక చివర చిన్న గంట కట్టి ఉంటుంది, కాలికి నూపురం ఉంటుంది. 

చేతికి కేయూరం ధరించి ఉంటాడు. 

ఆయన నేత్రాలు కృపా సింధువులై భక్త జనాల పై కరుణా కటాక్షాలు వర్షిస్తున్నట్లు విశాలంగా, తేజో పుంజాలను వేద జల్లేవిగా కనిపిస్తాయి. 


కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు.

 కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు, ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు వరకు, సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.


శృంగేరిలో జగద్గురువులు

 శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టించిన చదువుల తల్లి శారదాదేవి ఆలయం భారతదేశమంతా ప్రసిద్ధి చెందింది. 

కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి...

Friday, April 14, 2023

_జగద్గురు ఆదిశంకరాచార్యుల ప్రశ్నోత్తర రత్న మాలిక_


 _జగద్గురు ఆదిశంకరాచార్యుల ప్రశ్నోత్తర రత్న మాలిక_


*1.ఇహలోకంలో కోరిన కోర్కెలు తీర్చే చింతామణి లాగా దుర్లభమైనది ఏది?*

జ: ప్రియవాక్కులతో కూడిన దానగుణం, గర్వంలేని జ్ఞానం.

క్షమాగుణం కలిగిన శూరత్వం, ధనంతో పాటు త్యాగ గుణం

ఈ నాలుగింటినీ చతుర్భద్రం అంటారు.


*2.మెరుపులా తాత్కాలికమైనది ఏది?*

జ: చెడ్డ వారితో సాన్నిహిత్యం, యవ్వనం.


*3.కలికాలంలో కూడా తన  గౌరవాన్ని నిలబెట్టే వారు, శీలం నుంచి విచలితం కాని వారు ఎవరు?*

జ: సజ్జనులే!                                                                  

*4.బాధ పడ వలసిన విషయం ఏది?*

జ: ఎంత వైభవమున్నా దయనీయంగా బ్రతకడం.


*5.ప్రశంసనీయమైనది ఏది?*

జ: ఉదారగుణం                                                    

*6.మేధావులకు సైతం పూజ్యుడు ఎవరు?*

జ: ఎల్లప్పుడూ సహజంగానే వినయవంతుడై ఉండే వాడు.                                                                                 

*7.వంశకీర్థి అనే కమలాన్ని వికసింపజేసే సూర్యుడు ఎవరు?*

జ: ఎన్నో సద్గుణాలున్నా నమ్రత కలిగి ఉండే వాడు.      


*8.ఈ లోకం ఎవరికి సదా లోబడి ఉంటుంది?*

జ: ప్రేమతో, మేలు చేకూర్చే మాటలు పలికే వానికి, ధర్మాచరణలో నిమగ్నుడై ఉండే వాడికి


*9.లక్ష్మీ దేవి ఎవరిని ఇష్టపడుతుంది?*

జ: సోమరితనం లేని వారిని, నీతి బద్ధమైన ప్రవర్తన కలిగి వారిని..                                                      

*10.లక్ష్మీ దేవి ఎవరిని వెంటనే విడిచి పెడుతుంది?*

జ: సోమరిని, బ్రాహ్మణ, గురు, దేవతలని నిందించే వారిని.                                                                

*11.ఎక్కడ నివాసముండాలి?*

జ: మంచి వాళ్ళ చెంత. లేదా కాశీధామంలో


*12.ఏటువంటి ప్రదేశంలో ఉండకూడదు?*

జ: నిందారోపణలు చేసే ప్రజలున్న, లోభులైన నాయకులున్న చోటును వదిలిపెట్టాలి.


*13.అతి చిన్నతనం కలిగించే పనికి మూలమేమిటి?*

జ: విషయాసక్తుడైన పామరుడిని యాచించడం.     


*14.వీరుడు, శూరుడు ఎవరు?*

జ: కామదేవుని బాణాలు తగిలినా నిశ్చలంగా, ధృడంగా ఉండే వాడు.                                          


*15.కన్నులున్నా అంధులెవరు?*

జ: పరమేశ్వరుని పైన, వేదాలు, పరలోకం పైన విశ్వాసం లేనివారు.


( శ్రీపీఠం నుండి )

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం


 శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం


గురువు అనగా అజ్ఞానమును రూపుమాపి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసి ఆత్మోన్నతిని కలుగజేసేవాడు. అటువంటి గురువులకే గురువు, గురుశ్రేష్ఠుడూ దక్షిణామూర్తి.


ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో పరిపుష్టులో వారు మాత్రమే దక్షిణామూర్తి వైభవాన్ని తెలుసుకోగలరని ఆదిశంకరుల వాక్కు.


ఇది అది అని లౌకిక విషయాలు కాదు. ఆయన ఇవ్వలేని దంటూ ఏదీ లేదు. ఏదైనా అపారంగా వర్షిస్తాడు. పరమ కారుణ్యమూర్తి ఉపాసనాపరంగా మనల్ని వెంట ఉండి నడిపించే శక్తి ఆయన..


అయితే ఆయనను ఆరాధించే వారు ఎవరూ కూడా లౌకిక విషయాలు అడగలేరు. ఎందుకంటే ఆయన పాదాలను మనం పట్టే స్థితికి వచ్చాము అంటే మనకు లౌకిక విషయాల పట్ల కోరికలను కోరుకునే స్థితి ఉండదు. అంతా నీ కృప స్వామి ఏది ఇచ్చినా నీవే. కాపాడినను నీవే, కష్టపెట్టినా నీవే. అని నమ్మి అన్నింటినీ సాక్షి గా చూసే స్థితి ఉన్న వారే ఆయన అనుగ్రహానికి పాత్రులౌతారు. అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం మన ఉన్నతి కోసం. ఆదిశంకరుల అనుగ్రహ విరచితం.


శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్


మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ |

మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1॥


శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం చన్ద్రావదా తాంశుకమ్ ।

వీణాపుస్తకమక్ష సూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరైర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్॥ 2॥


కర్పూరపాత్రమరవిన్దదళాయతాక్షం కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ ।

చన్ద్రార్ధశేఖరమనన్తగుణాభిరామ- మిన్ద్రాదిసేవ్యపదపఙ్కజమీశమీడే ॥ ౩॥


ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థంముద్రోల్లసద్బాహుముదారకాయమ్ ।

సద్రోహిణీనాథ కళావతంసం భద్రోదధిం కఞ్చన చిన్తయామః ॥ 4 ॥


ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాఙ్గరాగప్రభం బాలం మౌఞ్జిధరం ప్రసన్నవదనం న్యగ్రోధ మూలేస్థితమ్ ।

పిఙ్గాక్షం మృగశావకస్థితికరం* *సుబ్రహ్మసూత్రా కృతిమ్ భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ ॥ 5॥


శ్రీకాన్తద్రుహిణోపమన్యు తపన స్కన్దేన్ద్రనన్ద్యాదయః ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతా గౌరవమ్ ।

తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మన్దస్మితాలఙ్కృతం చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే ॥ 6॥


కపర్దినం చన్ద్రకళావతంసం త్రిణేత్రమిన్దుపతి మాననోజ్వలమ్ ।

చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ ॥ 7॥


వామోరూపరి సంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం శ్యామాముత్పల ధారిణీ శశినిభాంచాలోకయన్తం శివమ్ ।

ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే॥ 8 ॥


వటతరునికట నివాసం పటుతరవిజ్ఞాన ముద్రితకరాబ్జమ్ ।

కఞ్చనదేశికమాద్యం కైవల్యానన్దకన్దళం వన్దే ॥ 9 ॥


ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సమ్పూర్ణమ్ ॥🙏🌺☘️

శ్రీ ముద్గల పురాణ శ్రీ సిద్ధి వినాయక స్తోత్రమ్ 


 *శ్రీ సిద్ధి వినాయక స్తోత్రం....!!*



1)విఘ్నేశ విఘ్నచయ ఖండననామధేయ శ్రీశంకరాత్మజ సురాధిప వంద్యపాద |


దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్- విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



2)సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతిః శ్రీసిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీః |


దక్షస్తనే వలయితాతి మనోజ్ఞశుండో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



3) పాశాంకుశాబ్జ పరశూంశ్చ దధ చ్చతుర్భి- -ర్దోర్భిశ్చ శోణకుసుమస్త్ర గుమాంగజాతః |


సిందూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



4)కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైః సంపూజితః సురవరైరపి మోదకాద్యైః |


సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



5) శీఘ్రాంచన స్ఖలన తుంగరవోర్ధ్వకంఠ స్థూలేందు రుద్రగణ హాసితదేవసంఘః |


శూర్పశ్రుతిశ్చ పృథు వర్తులతుంగతుందో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



6)యజ్ఞోపవీత పదలంభితనాగరాజో మాసాది పుణ్యదదృశీ కృతఋక్షరాజః |


భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



7)సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుంభ చారు వసనద్వయ ఊర్జితశ్రీః |


సర్వత్ర మంగళకర స్మరణప్రతాప విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



8)దేవాంతకాద్యసురభీత సురార్తి హర్తా విజ్ఞాన బోధన వరేణ తమోఽపహర్తా |


ఆనందితత్రిభువనేశ కుమారబంధో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||


ఇతి శ్రీముద్గలపురాణే శ్రీసిద్ధివినాయక స్తోత్రమ్ సంపూర్ణం ||...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🥀శ్రీగణేశస్తోత్రం🥀    (సామవేదోక్తం)


 *🥀శ్రీగణేశస్తోత్రం🥀*

                                

   (సామవేదోక్తం)


1) ఖర్వం లంబోదరం స్ఠూలం జ్వలంతం బ్రహ్మతేజసా |

  గజవక్త్రం మహానిర్వాణ మేకదంతమనంతకం ||


2) సిద్ధానాం యోగినామేవ జ్ఞానినాంచ గురోర్గురుం |

   ధ్యాతం మునీంద్రైర్దేవేంద్రైఃబ్రహ్మేసాశేషసమ్జకైః ||


3) సిద్ధేంద్రైర్మునిభిః సద్భిర్భగవంతం సనాతనం |

   బ్రహ్మస్వరూపం పరమం మఙ్గలం మఙ్గలాలయం ||


4) సర్వవిఘ్నహరం శాంతం దాతారం సర్వసంపదాం |

   భవాబ్ధిమాయా పోతేవ కర్ణధారంచ కర్మిణాం ||


5) శరణాగత దీనార్త పరిత్రాణాయ పరాయణం |

  ధ్యాయేద్ధ్యానాత్మకం సాధ్యం భక్తేశం భక్తవత్సలం ||


6) పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |

   విఘ్ననిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం ||


7) సురాసురేంద్రైః సిద్ధేంద్రైః స్తుతం స్తౌమి పరాత్పరం |

   సురపద్మదినేశం చ గణేశం మఙ్గలాలయం ||


8) ఇదం స్తోత్రం మహాపుణ్యం విఘ్నశోకహరంపరం |

   యః పఠేత్ప్రాతరుద్థాయ సర్వవిఘ్నాత్ప్రముచ్యతే ||

Tuesday, April 11, 2023

 *గాయత్రీ మంత్రం విశిష్టత..!!*


 *గాయత్రీ మంత్రం విశిష్టత..!!*


అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. 

అనన్యం,సర్వసిద్ధిప్రదం.


1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది

2. త్స - ఉపపాతకములను నివారించునది

3. వి - మహాపాతములను నివారించునది

4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.

5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది

6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది

7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.

8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది


9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.

10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.

11. దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది

12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.

13,. స్య - మానసిక దోషాలను నివారించును

14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.

15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును

16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును


17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును

18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.

19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును

20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును

21. ప్ర - విష్ణులోక ప్రాప్తి

22. చో - రుద్రలోక ప్రాప్తి

23. ద - బ్రహ్మలోక ప్రాప్తి

24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.


గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.


గాయత్రి - తూర్పు దిక్కును

సావిత్రి - దక్షిణ దిక్కును

సంధ్యాదేవి - పడమర దిక్కును

సరస్వతి - ఉత్తర దిక్కును

పార్వతి - ఆగ్నేయాన్ని

జలశాయని - నైరుతిని

పవమాన విలాసిని - వాయువ్య దిక్కును

రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక


తుత్ - పాదాలను

సవితుః - జంఘలను

వరేణ్యం - కటిని

భర్గః - నాభిని

దేవస్య - హృదయాన్ని

ధీమహి - చెక్కిళ్ళను

ధియః - నేత్రాలను

యః - లలాటంను

నః - శిరస్సును

ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.


ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగం శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.


తత్ - శిరస్సు

సకారం - ఫాలం

వి - నేత్రాలు

తు - కపోలాలు

వ - నాసాపుటాలు

రే - ముఖం

ణి - పైపెదవి

యం - కింది పెదవి


భ - మద్య భాగం

ర్గో - చుబుకం

దే - కంఠం

వ - భుజాలు

స్య - కుడి చేయి

ధీ - ఎడమ చేయి

మ - హృదయం

హి - ఉదరం


ధి - నాభి

యో - కటి

యో - మర్మప్రదేశం

నః - తొడలు

ప్ర - జానువులు

చో - జంఘం

ద - గుల్ఫం

యా - పాదాలు

త్ - సర్వ అంగాలు


ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.


స్వస్తి..!!🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

*సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*

 *సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*


🌾దైవీకమైన సువాసనలు వెదజల్లే స్ధానాలలో మహాలక్ష్మీ నివసిస్తున్నది.


🌾పసుపు, కుంకుమ, చందనం వంటి సువాసన పూజా ద్రవ్యాలు అన్నీ దేవికి

ప్రీతికరంగా భావింపబడుతున్నాయి.


🌾దేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు మనని చేరడానికి

సహాయపడే  పూజాద్రవ్యం

వట్టి వేరు, జీవితంలో విజయాలను ప్రసాదించే

వట్టివేరు.  

సువాసనలు

వెదజల్లే యీ వట్టివేరు

పూజకి ఉపయోగించే విధానాలు..


🌾గుప్పెడు వట్టివేరు తీసుకుని వచ్చి పూజ చేసే

గదిలో పెడితే  ఆధ్యాత్మిక

ప్రకంపనలు కలుగ చేస్తుంది.


🌾 ఒక చిన్న కప్పులో నీళ్ళు పోసి అందులో వట్టివేరు

నిమ్మ కాయ  వేసి పూజాగదిలో పెడితే

లక్ష్మీ దేవి పూర్ణానుగ్రహం

మనకి లభిస్తుంది.

(నిమ్మ కాయను అప్పుడు అప్పుడు మారుస్తూ వుండాలి)

🌾ఇందువలన  ఋణబాధలు

తొలగుతాయి.సిరిసంపదలు

లభిస్తాయి.


🌾వట్టివేరుతో చేసిన వేంకటేశ్వరుడు,గణపతి, యితర దైవాల మూర్తులను

పూజాగదిలో  పెడితే

శుభ ఫలితాలు లభిస్తాయి...*సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*


🌾దైవీకమైన సువాసనలు వెదజల్లే స్ధానాలలో మహాలక్ష్మీ నివసిస్తున్నది.


🌾పసుపు, కుంకుమ, చందనం వంటి సువాసన పూజా ద్రవ్యాలు అన్నీ దేవికి

ప్రీతికరంగా భావింపబడుతున్నాయి.


🌾దేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు మనని చేరడానికి

సహాయపడే  పూజాద్రవ్యం

వట్టి వేరు, జీవితంలో విజయాలను ప్రసాదించే

వట్టివేరు.  

సువాసనలు

వెదజల్లే యీ వట్టివేరు

పూజకి ఉపయోగించే విధానాలు..


🌾గుప్పెడు వట్టివేరు తీసుకుని వచ్చి పూజ చేసే

గదిలో పెడితే  ఆధ్యాత్మిక

ప్రకంపనలు కలుగ చేస్తుంది.


🌾 ఒక చిన్న కప్పులో నీళ్ళు పోసి అందులో వట్టివేరు

నిమ్మ కాయ  వేసి పూజాగదిలో పెడితే

లక్ష్మీ దేవి పూర్ణానుగ్రహం

మనకి లభిస్తుంది.

(నిమ్మ కాయను అప్పుడు అప్పుడు మారుస్తూ వుండాలి)

🌾ఇందువలన  ఋణబాధలు

తొలగుతాయి.సిరిసంపదలు

లభిస్తాయి.


🌾వట్టివేరుతో చేసిన వేంకటేశ్వరుడు,గణపతి, యితర దైవాల మూర్తులను

పూజాగదిలో  పెడితే

శుభ ఫలితాలు లభిస్తాయి...

*శివపంచాక్షరీ స్తోత్రం -*  *తాత్పర్యము :*


 *శివపంచాక్షరీ స్తోత్రం -* 

*తాత్పర్యము :*


నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ


మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ

మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ


శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ


వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ


యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచిత శివపంచాక్షరీ స్తోత్రం సమాప్తం


తాత్పర్యము: 


నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు.


మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి, గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.


సకల శుభకరుడు, కమలము వంటి గౌరీ దేవి వదనమును వికసింప చేసే సూర్యుడు, దక్ష యజ్ఞము నాశనము చేసిన వాడు, నీలకంఠుడు, వృషభము (ఎద్దు) పతాకముపై చిహ్నముగా కలవాడు, 'శి'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.


వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు మునీంద్రులచే పూజింపబడిన శిరస్సు (లింగం) కలిగిన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగిన, 'వ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.


యక్ష రూపములో ఉన్న, జటా ఝూటములు కలిగిన, పినాకము (అనే ధనుస్సు) చేత కలిగిన, సనాతనుడు (ఆది/అంతము లేని వాడు, అన్నిటికన్నా ముందు వచ్చిన వాడు), దివ్యమైన వాడు, దేవ దేవుడు, దిగంబరుడు, 'య'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.


ఫల శృతి:


శివుని సన్నిధిలో ఈ పంచాక్షరి స్తోత్రమును పఠనం చేసిన వారికి శివలోక ప్రాప్తి, శివుని సహవాసం కలుగును. ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన పంచాక్షరీ స్తోత్రం.

 *శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?*


 *శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?*


ఆది పరాశక్తి , జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయ్యి శివుడు అర్ధనారీశ్వరుడైనాడు...

గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం.


నంది (ఎద్దు):- శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది. 


శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని నందీశ్వరుని చెవులవద్ద భాదలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు. 


త్రిశూలము :- శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలములో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి.


నెలవంక చంద్రుడు :- శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందుమత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.


నీలిరంగుకంఠం :- శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు. 


రుద్రాక్ష :- శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తాడు. అంతే కాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' ( శివ యొక్క మరొక పేరు ) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్లినాయి. 


పాము :- శివుడు ఆయన మెడ చుట్టూ మూడు సార్లు చుట్ట బడిన ఒక పామును ధరిస్తారు. పాము మూడు చుట్టలకు అర్ధం .భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలను సూచిస్తాయి.నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది.


మూడో కన్ను:- శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపాని గురిఅయినప్పుడు చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది.అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వ వ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. 


డమరుకం :- శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. 


జటా :- అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు.సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. 


కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది.శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.


శివుడిని భక్తితో కోలిస్తే తనపై ఒక్క చెంబేడు నీళ్ళను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరునించే బోళాశంకరుడు.శివపంచాక్షరీ ఆపదకాలంలో శివ భక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది.

 *ఆశుతోషుని అనుగ్రహం - శివరహాస్యం నుంచి...!!*


 *ఆశుతోషుని అనుగ్రహం - శివరహాస్యం నుంచి...!!*

ఇళ్ళలో పూజించే లింగం పిడికిలిలో ఇమిడేలా (అంగుష్ఠ ప్రమాణం) ఉండాలి...

పార్థివలింగం అయితే తెరచిన పిడికిలి పరిమాణంలో ఉండవచ్చు (ఆరు అంగుళాలకి తక్కువ ఉండరాదు). 

ఆరు అంగుళాలకి తక్కువ ఉంటే ఆయుఃక్షీణం అవుతుంది.

అయితే అధిక సంఖ్యలో - (సహస్ర)లింగాలు చేసేటప్పుడు అనేక లింగాలు పెడతాం గనుక అవి చిన్నవే ఉంటాయి. 

వాటికి లెక్క లేదు, ఆలయాలలో పూజించే లింగములు ఇంతకంటే పెద్దవి ఉండవచ్చు.

శివపూజను చేసే చేతులు, శివాలయానికి వెళ్ళే కాళ్ళు, శివాలయంలో ప్రదక్షిణ చేసే పాదములు, శివునికి అర్పించిన మారేడుదళాదుల వాసనను ఆఘ్రాణించడం ,


శివనైవేద్యాలను భుజించడం, హృదయంలో శివుని ధ్యానించడం - ఈ అయిదు క్రియలు ఎవరికైతే ఉంటాయో వారికి దుఃఖాలు ఉండవు.

వాళ్ళు జన్మను సార్థక పరచుకున్నవారు, శివభక్తులలో గొప్పవారు అని చెప్పబడతారు, జీవికగా అయినా సరే ఆలయాలు శుభ్రం చేస్తే పదివేల చాంద్రాయణ వ్రతములు చేసిన ఫలితం పొందుతాడు.

తడిగా ఉన్న వస్త్రంతో తుడిస్తే అతిరాత్రమనే వైదిక యజ్ఞం చేసిన ఫలం కలుగుతుంది, శివాలయంలో బియ్యపు పిండితో రంగవల్లులు దిద్దినా, రకరకాల వన్నెలతో పద్మము, శంఖము మొదలైన ఆకృతులతో ముగ్గులు వేసినా అగ్నిష్టోమము అని చెప్పబడుతున్న వేదక్రతువు చేసిన ఫలం కలుగుతుంది.


కపిలగోవు కానీ మరి ఏ ఇతర (దేశీయ) గోవు క్షీరంతో అయినా శివునకు అభిషేకం చేస్తే వాని యొక్క వందలకొలది అపరాధాలైనా సరే ఆశుతోషుడు క్షమించి అనుగ్రహిస్తాడు.

కృష్ణాష్టమినాడు, సోమవారంనాడు ప్రదోషకాలంలో శివునికి నేతితో అభిషేకిస్తే దాని ఫలితం అమోఘమైనది, అనంతమైనది.


చెరకురసంతో పరమేశ్వరునికి అభిషేకం చేసినవారు వారి వంశంలోని అనేక తరాలతో సహా కైలాసాన్ని చేరతారు.


ప్రాతఃకాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, ప్రదోష కాలాలలో శివలింగాన్ని చూసినా, అర్చించినా వారు శివగణములలో ముఖ్యమైన వారు అవుతారు.


కుశ (దర్భల) జలములతో అభిషేకం భక్తితో చేసినవారు బంగారు విమానంలో బ్రహ్మలోకానికి చేరుకుంటారు...

దీనికి కొనలతో ఉన్న దర్భలు ఉపయోగించాలి, దర్భకు చివరిభాగాన్ని లవం అంటారు.


పచ్చకర్పూరము, అగరు మొదలైన వాటితో కూడిన జలముతో శివుని అభిషేకం చేస్తే సర్వపాపములూ తొలగి శివమందిరాన్ని చేరుకుంటారు.


పితృదేవతలు సద్గతిని పొందాలి అని సంకల్పించుకుని శివలింగానికి చల్లని నీటితో అభిషేకం చేస్తే, ఒకవేళ పితరులు నరకంలో ఉంటే ఉద్ధరింపబడి ఉత్తమలోకాలకు చేరతారు.


నెయ్యితో అభిషేకం చేశాక బియ్యపుపిండి కానీ, గోధుమపిండి కానీ తీసుకుని ఆ పిండిలో సుగంధములు కలిపి గోరువెచ్చని నీరు పోస్తూ శివలింగాన్ని శుభ్రం చేయాలి.


లింగ పీఠాన్ని, అంతటినీ బిల్వపత్రములతో శుద్ధి చేయాలి. ఇలా శుభ్రం చేసిన వారికి పదివేల ధేనువులు దానం చేసిన ఫలం లభిస్తుంది.


పుష్పమాలలు సమర్పించడం, పుష్పమండపం తయారుచేయడం, క్రిందివరకూ పూల మాలలు వ్రేలాడుతూ ఉండేలా చేస్తే ఆశ్చర్యకరంగా దేవతలు దగ్గరుండి దివ్యవిమానముల మీద శివపురమునకు తీసుకువెళ్తారు.


లింగమును, లింగపీఠాన్ని పూజించడం వల్ల దేవీ దేవతలను ఇద్దరినీ పూజించినట్లు అవుతుంది.


స్వామికి చేసే నివేదనలలో గోధుమలతో శర్కర (పటికబెల్లం/ బెల్లం) కలిపి అపూపములు (అప్పాలు) ఆవునేతితో వేయించి చేస్తే అది ఉత్కృష్టమైన భక్ష్యమై తరింపజేస్తుంది.


శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే ఒకొక్క అడుగుకి వెయ్యి అశ్వమేధాలు చేసిన ఫలం లభిస్తుంది.


ఆవుపాలు, నెయ్యి, పెరుగులతో కలిపిన అన్నములు, అనేక రకములైన కూరలు కలిపిన అన్నం, పూరీలు, అప్పాలు, మొదలైనవి విశేషంగా శివునకు నివేదన చేస్తే వారు నరకాలు చూడరు, వారికి పాపఫలాలు ఉండవు సరికదా ... దివ్యమైన భోగములు అనుభవిస్తారు.


శివునకు నివేదన చేసినప్పుడు ఎన్ని బియ్యపు గింజలు అందులో ఉన్నాయో ఒకొక్క మెతుకుకీ వెయ్యి సంవత్సరాల చొప్పున యుగ సహస్రాలు దివ్యలోకాలలో ఉంటారు. 

నిష్కామంగా చేసిన వారు రుద్రలోకానికే చేరుతారు.


గంధ జలములతో శివలింగాన్ని అభిషేకించినవారు గంధర్వాది లోకాలకు చేరుతారు.


లవంగము, కర్పూరము, మాదీఫలం, కొబ్బరి పలుకులు, జాతీపత్రం అనబడే పంచ సౌగంధికములతో తాంబూలం సకామంగా సమర్పిస్తే అనంతకాలం స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు.


నిష్కామంగా చేసినవారికి ఇహంలోనే జ్ఞానం, కైవల్యం క్రమంగా సిద్ధిస్తుంది...


స్వస్తి..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸