Thursday, February 2, 2017

గుడిమెట్లు కూడా ఎక్కని వారికి దేవుడు అన్నీ ఇస్తాడు..ఎందుకు ?
దేవుడు కొందరికీ ఎప్పుడూ కష్టాలు,కన్నీళ్ళే ఇస్తుంటాడు. గుడిమెట్లు కూడా ఎక్కని కొందరికి మాత్రం వారు కోరుకున్నట్లుగా అన్నీ ఇస్తాడు.
ఎందుకిలా జరుగుతోంది.???
ఈ ప్రశ్నకు సమాధానం కర్మ సిద్దాంతంలో ఉంది.
అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్-
పుణ్యపాప రూపకర్మను ఎవరు చేసినా దానిని వారు తప్పక అనుభవించి తీరాల్సిందే.
కార్యకారణముల గొలుసే కర్మ. మనం చేసే పనే కాదు, చేయాలనే ఆలోచన, దాని ఫలితం కూడా కర్మను అనుసరించివస్తుంది.
కర్మలు మూడు విధములు సంచితం, ప్రారబ్ధం, ఆగామి.
ఇంతకు ముందు అనాది జన్మలో అర్జించిన కర్మను సంచితం అంటారు.
ఇందులోంచి ఈ జన్మలో ఈ శరీరంలో అనుభవించేదంతా ప్రారబ్ధం.
ఈ జన్మలో చేసినది వెనుక నిలువలో కలిసి రాబోవు జన్మలో అనుభవించవలసినది ఆగామి.
మామిడి పళ్ళ కాపు నుండి పండిన మామిడ పళ్ళను తీసి ఇచ్చినట్లుగా, భగవంతుడు ప్రతీ జీవికి వాని కర్మాణుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు.
ఏ కర్మ ఫలమును ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయించేది భగవానిడే. గత జన్మలోచేసిన పుణ్య కర్మ ఫలములు ఈ జన్మలోకి అనుభవంలోకి వస్తున్నాయికాబట్టే, ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నారు. శాంతిని పొందుతున్నాడు.
గత జన్మలో చేసిన పాప కర్మలు , ఈ జన్మలోకి అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు మానవుడు కష్టాలు పడుతూ, కన్నీళ్ళు పాలవుతున్నాడు.
అందుచేత చేసే ప్రతీ మంచి పని ఆ భగవంతుడే చేయిస్తున్నాడనీ, ఆ పని ఫలితం ఏదైనా వాడికే చెందుతుందని .. . భాధ్యత అంతా వాడిదేనని. . .
తాను భగవంతుని చేతిలో ఓ పని ముట్టు మాత్రమేనని ధృడంగా విశ్వసించి భగవత్, భాగవత( భక్త ), ఆచార్య కైంకర్య రూపంగా అన్ని పనులు చెయ్యాలి.
భగవంతుడే అనుగ్రహించి కావలసినవన్నీ తానే ఇచ్చి, పూర్వకర్మలన్మింటినీ తొలగించి, తనతో చేర్చుకుంటాడు.
ఒక్కమాట చెప్పాలంటే మాధవ సేవగా సర్వప్రాణకోటి సేవ చేయడమే మనిషికి భగవంతుడు అనుగ్రహించే వరం.
అదే మానవ జన్మకు సార్ధకత.

No comments:

Post a Comment