Thursday, February 23, 2023

Gajendra Mokshamu


 *🐘🐊 గజేంద్ర మోక్షము 🐘🐊....!!*


స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో  శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు.

అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు...

ఇది పోతన రచించిన 

భాగవతం లోనిది.


*విష్ణుమూర్తి గజేంద్రున్ని రక్షించడం.🙏*


త్రికూట పర్వత విశేషాలుసవరించు

క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. 

ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి, ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో అలరారుతూండేవి. 

ఆ కొండల మీద రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు, ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. 

ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలముకొనేది. 

ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది.

అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి.


గజరాజు జల క్రీడలు ఆడడంసవరించు

అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతి విశాలమైనది, ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. 

వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు, ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లోకి ప్రవేశించి నీళ్ళు తాగి, తొండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. 


అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలోని కర్కాటక మీనాలు, రోదసిలోని మీన కర్కాటాకాలను చేరినట్లు కనిపించింది.

కరిమకర సంగ్రామంసవరించు

ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకొంది. 

పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. 

వేంటనే ఆ మెసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మెసలిని కుమ్మి విడిచింది, అప్పుడు ముసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. 

అలా ఆ కరి, మకరం ఒక దానిని ఒకటి కుమ్మి చీల్చుకొంటుండగా కరి బలం సన్నగిల్లుతోంది. 


జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది. 

ఈ సందర్భాన్ని పోతన తన గజేంద్ర మోక్షం కావ్యంలో ఇలా వర్ణించాడు.


🙏కరి దిగుచు మకరి సరసికి

గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

గరికి మకరి మకరికి గరి

భర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.🙏


మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుడుకి ఈ విధంగా మ్రెక్కింది.

కలడందురు దీనులయెడ

గలడందురు పరమయోగి గణములపాలం

గలడందు రన్ని దిశలను,

గలడు గలం డనెడువాడు గలడో లేడో లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;

రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా;


అలా మొరపెట్టుకొన్నప్పుడు శ్రీమహావిష్ణువు వైకుంఠంలోని మందార వనాంతరంలో ఉన్న సరోవర సమీపంలోని చంద్రకాంత వేదికపై శ్రీమహావిష్ణువు లక్ష్మీ దేవితో సరస సల్లాపాలాడుతున్న సమయంలో గజరాజు పాహి పాహి అన్న మాట చెవిని పడింది.


వెంటనే ఉన్నఫళాన గజరాజు రక్షణ కోసం బయలు దేరినాడు...

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే

పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం

తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.


అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది.

ఏదుష్ట దుశ్శాసనుడు కబంధ హస్తాలలోనైన చిక్కుకొని ద్రౌపది దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా! మళ్ళి పరమమూర్ఖుడైన  సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చాడా!


అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా!  ప్రహ్లాదుని వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది.


*గజేంద్రుడిని మహావిష్ణువు రక్షించుట*

ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరీచేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచి పెట్టగానే విస్ఫులింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది. 

అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. 


అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని (శంఖం) పూరిస్తాడు. ఆ పాంచజన్యం ధ్వని శత్రు జనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది.

నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకొంటాడు.


నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.


గజరాజు మకరం జన్మ వృత్తాంతంసవరించు

దేవలుడు అనే ముని శాపం వల్ల హూహూ అనే గంధర్వుడు "మొసలి" రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు.


ఇంద్రజ్ఞమునుడు అనే రాజు అగస్త్యమహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై వైకుంఠం చేరుకొన్నాడు...


స్వస్తి..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment